నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 19:32

Rahul Gandhi: రైతులే దేశానికి బలం - రాహుల్‌ గాంధీ

దిల్లీ: రైతులే దేశానికి బలమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. వారి సమస్యలను విని, వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటే దేశంలో ఉన్న సగం సమస్యలు పరిష్కరించవచ్చన్నారు..

ఇటీవల హరియాణా సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామంలో రైతులు (Farmers), వారి కుటుంబాలతో ముచ్చటించిన వీడియోను రాహుల్‌ గాంధీ షేర్‌ చేశారు..

'రైతులే దేశానికి ఎంతో బలం. సోనీపత్‌లో సంజయ్‌ మాలిక్‌, తస్బిర్‌ కుమార్‌ అనే ఇద్దరు రైతు సోదరులను కలుసుకున్నాను. వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఎన్నో ఏళ్లుగా కలిసే వ్యవసాయం చేస్తున్నారు. వారితోపాటు నేనూ పొలంలో దిగి వరి నాట్లు వేయడంలో సహాయపడటంతోపాటు, ట్రాక్టర్‌ నడిపాను. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ఆ గ్రామ మహిళలు మాపై ఎంతో అభిమానం చూపారు. వారి ఇంటినుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఇచ్చారు.

మన దేశంలోని రైతులు ఎంతో నిజాయతీ, సున్నిత మనస్తత్వం కలిగిన వారు. వాళ్లు పడే కఠినశ్రమ గురించి తెలుసు. అవసరమైనప్పుడు, కనీస మద్దతు, ఇన్సూరెన్స్‌, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి అభిప్రాయాలను అర్థం చేసుకుంటే, దేశంలోని ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు' అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 19:31

Payyavula Kesav: సీబీఐ విచారణకు మంత్రి అంబటి ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నా: పయ్యావుల..

అమరావతి: రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు పనులపై తెదేపా నేత, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మరోసారి స్పందించారు. ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు..

ప్రాజెక్టు పనుల కుంభకోణంపై త్వరలోనే సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ఎంబుక్‌ రికార్డును నిర్ధారించుకున్నాకే బిల్లులు చెల్లించారని చెబుతూ.. కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందనేందుకు ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు.

ప్రాజెక్టులో ఎలక్ట్రో మెకానికల్‌ పనుల ఖర్చు రూ.100కోట్లు కాగా.. మంత్రి అంబటి మాత్రం రూ.739కోట్లు విడుదల చేశామని చెప్పారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలకు 2020జులైలో టెండర్లు పిలిచారని, అప్పటికి రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ కార్పొరేషన్‌ లేనేలేదని అన్నారు. రుణాన్ని తీసుకునేందుకు 2020 నవంబరులో కంపెనీ ఏర్పాటు చేశారని పయ్యావుల కేశవ్‌ తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 19:29

'వైఎస్సార్‌సీపీ 175కి 175 సీట్లు గెలుచుకునే వాతావరణం ఉంది'

తాడేపల్లి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175కి 175 సీట్లు గెలుచుకునే వాతావరణం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు..

ఈరోజు(ఆదివారం) పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు సజ్జల. ఎమ్మెలేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

రాష్ర్టంలో వైసీపి 175 కి 175 స్దానాలు గెలుచుకునే వాతావరణం ఉంది. ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. దొంగఓట్ల తొలగింపు,అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుకుగా ఉండాలి. అసైన్డ్ భూములు, చుక్కల భూములు విషయంలో ప్రభుత్వ తీసుకున్న మేలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీకి ప్రతిరోజు కీలకమే. పార్టీ పరిశీలకులు ఎంఎల్ఏలకు, కోఆర్డినేటర్లకు సంధానకర్తలుగా క్రియాశీలకంగా వ్యవహరించాలి. వాలంటీర్లను ఢీఫేమ్ చేయాలని, టెర్రరైజ్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విద్వేష, విషపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టాలి' అని సజ్జల పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 19:28

Janasena: పవన్‌ కల్యాణ్‌తో పంచకర్ల రమేశ్‌బాబు భేటీ.. 20న జనసేనలో చేరిక

మంగళగిరి: ఇటీవల వైకాపా విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్‌బాబు జనసేన గూటికి చేరనున్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పంచకర్ల రమేశ్‌బాబు కలిశారు..

పవన్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో తాజా రాజకీయ పరిణామాలపై పంచకర్ల చర్చించారు. ఈ నెల 20న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పంచకర్ల రమేశ్‌బాబు పెందుర్తి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పంచకర్ల చేరికతో విశాఖలో జనసేన బలం పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 19:11

న్యాయవాది వేముల అందీప్ కుమార్ జన్మదిన వేడుకలు

శాలిగౌరారం:శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు , న్యాయవాది వేముల అందీప్ కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఏజీపీ ,విష్ణు హైకోర్టు న్యాయవాది వీరబాబు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణిస్తూ పేదవారికి చట్టపరమైన సహాయ సహకారాలు అందించే విధంగా ముందంజలో ఉండాలన్నారు. న్యాయవాదులు రాజేందర్, ఆంజనేయులు, శ్రీను, ప్రశాంత్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 18:43

గురుకుల విద్యార్థుల సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

•బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మునుగోడు రోడ్ లో అప్పాజీపేట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాలను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థులని అడిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను పేరు కోసమే ప్రారంభించారు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గాని సమక్షించకపోవడం చాలా దురదృష్టకరం కేవలం రాజకీయాలకే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులని వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోవడం బీసీ విద్యార్థి సంఘం తరఫున ఖండిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం విద్యార్థుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉన్న తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలి .వాస్తు బాగాలేదని మంచిగా ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని కూలగొట్టి ఒక సంవత్సరంలో సచివాలయం మాత్రం దగ్గరుండి కట్టించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి గురుకులాలకు మాత్రం 9 సంవత్సరాలు నుండి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా శోచనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క  గురుకుల పాఠశాల కట్టించలేకపోయాడు.

ఈరోజు అధికారులు కమిషన్ల కోసం అరకొర వసతులు ఉన్న బిల్డింగ్స్ ని తీసుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు జిల్లా కలెక్టర్లు గారు పర్యవేక్షణ లేకపోవడం వల్ల గురుకుల పాఠశాలలను వారికి ఇష్టం వచ్చినట్లుగా జిల్లా కేంద్రాలకు దూరంగా కనీసం రవాణా సౌకర్యం లేని బిల్డింగ్స్ ఊర్లలో తీసుకొని విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులని చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ లేకపోవడం వల్ల గురుకులాల పాఠశాలలో ఉన్న సిబ్బంది వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న అప్పాజీపేట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో అక్కడున్నటువంటి సిబ్బంది

ఏ మాత్రం శ్రద్ధ లేకుండా విద్యార్థులకు వంట వండే సమయంలో బియ్యంలో పురుగులు ఉన్నా కూడా అలాగే వండి పెట్టడంతో విద్యార్థులు అన్నం కూడా సరిగా తినలేక పోతున్నామని అక్కడున్నటువంటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఆదివారం కావడంతో ప్రిన్సిపల్ కూడా పాఠశాలలో లేకపోవడంతో అక్కడున్న సిబ్బంది మెనూ ప్రకారం వంటలు కూడా చేపియలేకపోయారు ఇదేమని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అడగగా పొంతనలేని సమాధానం చెప్పి దాటవేస్తున్నారు అక్కడున్న విద్యార్థులు బిల్డింగు ప్రహరి కూడా లేకపోవడంతో రాత్రిపూట పాములు తేళ్లు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి తక్షణమే

జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క పాఠశాలను సందర్శించి మౌలిక వస్తువులు కూడా సరిగా లేవు అని చెప్పి విద్యార్థులు తెలియజేశారు మరి అన్ని మౌలిక వసతులు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న గురుకుల పాఠశాల సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం లేని ఎడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బిసి విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు ఎరుకల లక్ష్మణ్ గౌడ్, వెంకన్న ,చంద్రశేఖర్ ,శివకుమార్ ,పరమేష్, మల్లేష్ ,మహేష్ ,పృథ్వీరాజ్ ,సత్తయ్య ,లింగస్వామి ,యాదయ్య , ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 12:29

Purandeshwari: ఎన్నికలకు ఐదారు నెలల సమయమే.. నేతలకు పురంధేశ్వరి దిశానిర్ధేశం

Purandeshwari Speech in BJP State Leaders Meeting: విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారన్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి అన్నారు..

ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉందని.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగుల పైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందన్నారు. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందన్నారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదన్నారు..

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 12:21

TTD: శ్రీవాణి ట్రస్టుపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తితిదే ఈవో

తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు తితిదే ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు రేపు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు..

ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నందున.. సోమవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారు. దీంతో నేడు వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించరు.

శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. '' శ్రీవాణి ట్రస్టుపై మరో ఆరోపణ వచ్చింది. కావాల్సిన వారికి ఆలయాలు నిర్మాణ కాంట్రాక్ట్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతుంది. పార్వేట మండపాన్ని కూల్చివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 12:20

Chandrababu: రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

రాజాం: విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు..

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.

రాజాంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jul 16 2023, 12:17

సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు.

లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనాల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతోందని చెప్పారు.

ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తలసాని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయంను చాటి చెప్పారన్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యతతో బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి తలసాని అన్నారు...